దేశం కోసం మోదీ '7 విజ్ఞప్తులు'.. మనం సిద్ధమేనా?
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయులందరికీ 7 కీలక విజ్ఞప్తులు చేశారు. ఇది కేవలం మాటలు కాదు, ప్రతి పౌరుడి బాధ్యత! ఆ 7 విజ్ఞప్తులు ఇవే: పెట్రోల్/డీజిల్ పొదుపు: అనవసర ప్రయాణాలు తగ్గించండి, ప్రజా రవాణా లేదా కార్పూలింగ్ ఉపయోగించండి. వర్క్ ఫ్రమ్ హోమ్: సాధ్యమైనంత వరకు ఇంటి నుండే పని చేస్తూ ఇంధనాన్ని ఆదా చేద్దాం. విదేశీ ప్రయాణాలు వద్దు: ఈ ఏడాదికి విదేశీ టూర్లు, వెడ్డింగ్ డెస్టినేషన్లు వాయిదా వేసుకుందాం. బంగారం కొనుగోలు నిలిపివేత: అత్యవసరం అయితే తప్ప ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేద్దాం. వంట నూనె వాడకం: ఆరోగ్యం కోసం, దేశం కోసం నూనె వాడకాన్ని 10% తగ్గించుకుందాం. సేంద్రియ సాగు: రసాయనిక ఎరువుల వాడకాన్ని 50% తగ్గించి, భూమిని కాపాడుకుందాం. ఓకల్ ఫర్ లోకల్: కేవలం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం. ఎందుకు ఈ నిర్ణయం? ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మనందరి కర్తవ్యం. భారత ఆర్థిక రక్షణ కవచంలో మీరు భాగస్వాములు...