మహిళలు – పిల్లల భద్రతే మా ప్రధాన లక్ష్యం | “స్పందన” టీంల ప్రారంభం

 


“మహిళలు – పిల్లల భద్రతపై ఎలాంటి రాజీ లేదు… డ్రగ్స్ విషయంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదు!” — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అభివృద్ధిలో ఆడబిడ్డల భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాదని మా నమ్మకం. అందుకే ప్రతి నిర్ణయంలో, ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం.

మహిళలు, పిల్లల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా “స్పందన” టీంలను ఈ రోజు ICCCలో ప్రారంభించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వడం, భద్రతను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

తెలంగాణలో డ్రగ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మూలించాల్సిందే. డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్ద వారు ఉన్నా ఎలాంటి రాజీ లేదు. డ్రగ్స్ రహిత సమాజంతోనే మహిళలు, పిల్లలకు నిజమైన భద్రత లభిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సీతక్క గారు, ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


#PrajaPrabhutvam #CMRevanthReddy #WomenSafety #DrugFreeTelangana #WomenEmpowerment #SafeTelangana #telanganavoice24


Comments

Popular posts from this blog

CM Revanth Reddy's Press Meet on Delimitation and Mahila Bill #CM #Revanthreddy

రైతు భరోసా వేదికగా రేవంత్ రెడ్డి గర్జన: కేసీఆర్‌కు సవాల్, రైతు సంక్షేమమే లక్ష్యంగా కీలక ప్రకటనలు! #CM #Reventhreddy

గులాబీ బాస్ గర్జన.. కేసీఆర్ ఫుల్ క్లారిటీ! ఇకపై పార్టీలో నో పాలిటిక్స్.. ఓన్లీ పర్ఫార్మెన్స్! #KCR #BRS #KTR